Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : ఆజాదీకా అమృత్ మహోత్సవం సందర్భంగా ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం, తిరుపతి మరియు వేఫౌండేషన్, తిరుపతి సంయుక్తంగా పాఠశాల విద్యార్థులకు భారతదేశం: విజన్ 2047 అనే అంశం మీద చిత్రలేఖన పోటీలను నిర్వహిస్తున్నాయి. పోటీలను విద్యార్థులు వారు చదువుతున్న తరగతి ఆధారంగా 3 విభాగాలలో పోటీ నిర్వహించబడుతుంది. 1.చిన్నపిల్లలు: 1-4వతరగతి విద్యార్థులకు,2.జూనియర్స్: 5 - 7వతరగతి విద్యార్థులకు,3.సీనియర్స్: 8-10వతరగతి విద్యార్థులకు. తేదీ మరియు సమయ వివరాలు: పిల్లలు మరియు జూనియర్లకు, 12 ఆగస్టు 2023న ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.00 వరకు పోటీలునిర్వహించబడను.సీనియర్లకు 13 ఆగస్టు, 2023న ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు పోటీలు నిర్వహించబడను. విజేతలకు బహుమతులు మరియు పార్టిసిపేషన్సర్టిఫికేట్లను 15 ఆగస్టు, 2023న మధ్యాహ్నం 3.00 గంటలకు పంపిణీ చేయబడుతుంది. వేదిక: ప్రాంతీయవిజ్ఞానకేంద్రం, తిరుపతి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. అన్ని విభాగాలలో బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు పోటీకి సంబందించిన పోస్టర్ ను ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం ,తిరుపతి క్కురేటర్ సుదీప్తో సాహూ గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్య ,నాక్ మెంబెర్ డా. సి.శ్రీరాములు, రాయలసీమ మిమిక్రీ అండ్ మేజిక్5అకాడమీ గౌరవ అధ్యక్షులు డా. డి. విజయ కుమార్, తిరుపతి బాలోత్సవం అధ్యక్షులు నడ్డి నారాయణ, కలాం ట్రస్ట్ బాషా సిరివెళ్ల, తహసీన్ బేగం, వినోద్ కుమార్ పాల్గొన్నారు.
Admin
Famous TV