Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ కార్యాలయంలో సూట్స్ కేర్ నెట్వర్క్ కంపెనీ వారు జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకి 120 మంది అభ్యర్థులు హాజరు కాగా మూడు దశలలో జరిగిన ఇంటర్వ్యూలో 16 మందిని ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైన అభ్యర్థులకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి గారు ఆఫర్ లెటర్స్ అందచేసి అభినందించారు. ఎంపికైన వారు కష్టపడి పని చేసి కంపెనీ ఉన్నతికి కృషి చేయాలనీ కోరారు. తిరుపతి జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు పేరెన్నిక గల కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని భవిష్యత్లో నిరుద్యోగ యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆయన తెలియజేసారు. సూట్స్ సోషియో హెల్త్ టెక్ కంపెనీ భారతదేశంలో అందరికి అందుబాటులో ఆరోగ్య సంరక్షణ మరియు గోల్డెన్ అవర్ ట్రామా కేర్ సాధించటానికి ఆరోగ్య సేవలు డిజిటలైజేషన్ ద్వారా ప్రజలలోకి తీసుకొస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలియజేసారు. అదే విధంగా తిరుపతి జిల్లా మాత్రమే కాకుండా చిత్తూరు జిల్లా నుండి అనంతపురం జిల్లా వరకు ప్రతిభ కలిగిన నిరుద్యోగులకు సూట్స్ కేర్ నెట్వర్క్ కంపెనీ వారు భవిష్యత్లో ఉద్యోగ అవకాశాలను కల్పించబోతున్నారని సూట్స్ కేర్ నెట్వర్క్ కంపెనీ సీఈఓ డా. సోమశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ సంస్థ సీఈఓ కిరణ్ కుమార్ రెడ్డి, జనరల్ మేనేజర్ చెవిరెడ్డి హేమచంద్ర రెడ్డి మరియు సూట్స్ సిబ్బంది పాల్గొనడం జరిగినది.
Admin
Famous TV