Monday, 27 July 2026 08:49:11 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఉజ్వల భవిష్యత్తు ఉత్పాదకరంగం ద్వారా సాధ్యమే

ఆచార్య జి.రంగజనార్ధన , ఉపకులపతి, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం

Date : 26 June 2023 07:14 PM Views : 469

Famous TV - విద్య ఉద్యోగాలు / అనంతపురం : అనంతపురం .స్థానిక జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ద్వితీయ స్నాతకోత్సవ వేడుకకు అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి. రంగజనార్ధన ముఖ్య అతిథిగా విచ్చేశారు.వారు తన స్నాతకోపన్యాసంలో ముందుగా ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులను అభినందిస్తూ వారికి దిశ నిర్దేశం చేశారు.దేశ భవిష్యత్తు ఆర్థిక రంగంపై ఉంది యువత కేవలం సేవారంగంపై మొగ్గుచూపుక ఉత్పాదక రంగం వైపు అడుగులు వేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు . చిన్న దేశాలైన తైవాన్ దక్షిణ కొరియా వంటివి ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి అంటే ఆయా దేశాలు ఉత్పాదకరంగంలో సాధించిన అభివృద్ధే కారణం అని ఆయన అన్నారు. అనంతరం కళాశాల వ్యవస్థాపకులు శ్రీ జి.పుల్లయ్య గారు మాట్లాడుతూ కర్నూలు నగరంలోని తమ కళాశాల పెద్ద పెద్ద నగరంలోని డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు ధీటుగా ప్లేస్మెంట్స్ సాధిస్తూ విద్యార్థులకు ,తల్లిదండ్రులకు గట్టి భరోసా ఇస్తున్నామన్నారు. అదేవిధంగా విద్యార్థినీ విద్యార్థులు చదువుకుంటూనే సంపాదన వైపు దృష్టి పెట్టినట్లయితే ఆ విద్యార్థి లేదా విద్యార్థిని జీవితంలో రాణిస్తారన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఈ సంస్కృతి మనదేశంలో కూడా రావాలని అభిలాషించారు .రానున్న రోజుల్లో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని దీనికి మూల కారణం యువభారతమే అని అన్నారు . పట్టభద్రులైన ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులు గర్వపడేలా, జాతి నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు .దేశం గుర్తించేలా ప్రవర్తించాలని సూచించారు .ఈ సందర్భంగా బ్రాంచీల వారిగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్య అతిథి బంగారు పథకాలను ప్రధానం చేశారు .అనంతరం కళాశాల చైర్మన్ శ్రీ జి.వి.యం. మోహన్ కుమార్ విద్యార్థినీ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 489 మంది విద్యార్థినీ విద్యార్థులుగ్రాడ్యుయేషన్ పట్టాలు పుచ్చుకుంటున్నారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వై. పాండురంగయ్య,అడ్మన్ డీన్ డాక్టర్ ఎం. గిరిధర్ కుమార్ ,డీన్లు మరియు వివిధ శాఖాధిపతులు, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :