Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : కరకంబాడి అమరరాజా విద్యాలయంలో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు 2024-25 వ సంవత్సరానికి గాను శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు గ్లోరి దేవ ప్రియ మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందితే దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యతాయుతంగా మెలుగుతారని చెప్పారు. ఇదే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని అమరరాజా విద్యాలయం మొదటి నుంచి చక్కటి ప్రణాళికతో ముందుకెళ్తోందని గుర్తుచేశారు. ఎన్నికల నిర్వహణ, ఓటు హక్కు వినియోగం పట్ల విద్యార్థులకు అవగాహన వస్తే పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటౌతుందన్నారు. ఈ ఎన్నికలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Famous TV