Famous TV - సామాజిక సేవ / తిరుపతి : సోమవారము ఎస్వీ వైద్య కళాశాల రుయా ఆసుపత్రి లో బాల గుర్రప్ప ను చికిత్స కోసం అత్యవసర విభాగాన్ని తరలిస్తుండగా రోడ్ ప్రమాదంలో చనిపోయిన కె.బాల గుర్రప్ప, సుమారు 30 సంవత్సరాల యువకుడు, కుక్కల దొడ్డి గ్రామము, మామండూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి రుయా ఆస్పత్రి లో చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోవడం జరిగింది. ఆయన భార్య గురు లక్ష్మి , భర్త నేత్రాలను దానం చేయడానికి ముందుకు రావడం జరిగినది. కంటి విభాగాధిపతి డాక్టర్ చలపతి రెడ్డి, ఆధ్వర్యంలో రెడ్డి, బాల గుర్రప్ప నేత్రాలను సేకరించి నేత్ర విభాగ, నేత్ర నిధి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగినది. నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులు చనిపోయిన వ్యక్తిగా బాల గుర్రప్ప భార్య గురు లక్ష్మి గృహిణి , మరియు వారి తల్లిదండ్రులు,ఇరువురి సమ్మతితో ఆయన నేత్ర లు తీసుకోవడం జరిగినది. వెంటనే నేత్ర విభాగ టెక్నీషియన్ రమేష్, నేత్రాలను సేకరించి భద్రపరచడం జరిగినది. నేటి యువత తన తదనంతరం అవయవ దానాలకు, నేత్ర దానాలకు , ముందుకు రావడం జరుగుతున్నది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో వీటిని సేకరించడం జరుగుతున్నది. రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి రవి ప్రభు , మాటలాడుతూ పేద రోగులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఈ అవయవాలను వారికి అమర్చడానికి ఇలాంటి అవయవ దానాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. పుర ప్రజలు ఎవరైనా నేత్ర దానం చేయాలంటే ఈ క్రింది నెంబర్ కు సంప్రదించవచ్చును, సెల్ నెంబర్: 8500880126, ఈ కార్యక్రమంలో ఐ బ్యాంక్ టెక్నీషియన్ రమేష్, మరియు ఎస్ వి వైద్య కళాశాల పి.ఆర.ఓ.వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV