Famous TV - సామాజిక సేవ / చిత్తూరు : తిరుపతికి చెందిన ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ (జె సి ఐ) ఇండియా జాతీయ ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. బెంగుళూరు హిల్టన్ హోటల్లో జరిగిన జాతీయ సదస్సు సందర్భంగా ఎన్నికయ్యారు. రేకేష్ శర్మ ( కేరళ)ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా హర్షవర్ధన్ తో పాటు కార్తికేయ మధ్యస్థ ( కర్ణాటక), గుడిత్ సింగ్ సహ్మే ( ఉత్తర ప్రదేశ్), రమేష్ దాడిగల ( తెలంగాణ) ఇషాన్ అగర్వాల్ ( గుజరాత్) ఎ. శరవణన్ ( తమిళనాడు) ఎన్నికయ్యారు. 2018లో జె సి ఐ తిరుపతి శాఖ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 2019లో జోన్ ఉపాధ్యక్షుడు, ఆసియా పసిఫిక్ డెవలెప్మెంట్ కౌన్సిల్ అధికారిగా ఉన్నారు. 2020లో జోన్ డైరెక్టర్, 2021లో జోన్ అధ్యక్షుడుగా సేవలు అందించారు. 2022 లో జె సి ఐ జాతీయ ఫౌండేషన్ సభ్యునిగా, 2023 లో జాతీయ డైరెక్టర్ అయ్యారు. 2024 సంవత్సరానికి జాతీయ ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.గత మూడేళ్లలో నెస్లే సంస్థ సహకారంతో ఎపి, తెలంగాణ రాష్ట్రాలలో కోటి రూపాయలకు పైగా విలువైన నిత్యావసర వస్తువులను పేదలకు పంపిణీ చేశారు. రాయలసీమ నుంచి జె సి ఐ ఉపాధ్యక్షుడు అయిన మొదటి వ్యక్తి, రాష్ట్రం నుంచి ఎన్నికైన రెండవ వ్యక్తి కావడం విశేషం. బహుముఖ ప్రజ్ఞాశాలి కావడం, సమాజ సేవలో విశేష కృషి చేయడం ఆయన ఎదుగుదలకు కారణం. ఆయన ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి.తిరుపతి ఐఐటిలో అంతర్జాతీయ అధికారిగా పనిచేశారు. వెల్లూరు వి ఐ టి లో పి హెచ్ డి చేస్తున్నారు. విద్యార్థి దశలో టెన్నిస్, బ్యాడ్మింటన్, టెక్వాండో, రోలర్ స్కేటింగ్, స్కేటింగ్ హాకీ క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించారు.ఒకే సారి ఎంబిఎ, ఎం ఎస్ డబ్ల్యు, ఎం ఎస్ సైకో థెరపీ పాసయ్యారు. శ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబిఎ అధ్యాపకుడు, విభాగాధిపతి బాధ్యతలు నిర్వహించారు.వ్యక్తిత్వ వికాస శిక్షణకునిగా సేవలు అందిస్తున్నారు.
Reporter
Famous TV