Famous TV - సామాజిక సేవ / తిరుపతి : శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి సూచించారు. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా రేణిగుంట ఆక్స్ఫర్డ్ మోడల్ స్కూల్లో జరిగిన విజ్ఞాన ప్రదర్శనలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు సామాజిక అంశాలతో పాటు, శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని చెప్పారు. తార్కిక ఆలోచనలు, సృజనాత్మక శక్తి శాస్త్రీయ పరిజ్ఞానానికి పునాది వెస్తాయని తెలిపారు. కార్యక్రమంలో మంచి ప్రాజెక్టులు చేసిన పిల్లలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జె.సి.ఐ తిరుపతి శాఖ అధ్యక్షుడు టి వై చైతన్య తేజ్ కార్యదర్శి ఆర్ శేషసాయి, సంయుక్త కార్యదర్శి వాహిద్య, ప్రాజెక్ట్ చైర్ పర్సన్ సయ్యద్ సుమయ్య, స్కూల్ కరస్పాండెంట్ జీ గౌతమి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Reporter
Famous TV