Famous TV - జాతీయ వార్తలు / తిరుపతి : దేశంలో పెద్ద పరిశ్రమలు సకాలంలో పన్నులు చెల్లిస్తే వారిని ఆదర్శంగా తీసుకుని చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు చేసుకునే వారి కూడా త్వరగా పన్ను చెల్లింపు చేస్తారని తద్వారా దేశం ఆర్ధిక పురోభివృద్ధికి సహకరించిన వారు అవుతామని సీజీఎస్టీ ఆడిట్ కమిషనరేట్ పి.ఆనంద్ కుమార్ కోరారు. తిరుపతి అమరావతి నగర్ లోని ఆడిట్ కమిషనరేట్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో పన్ను చెల్లింపు చేసే వారి సంఖ్య 70 లక్షల నుంచి 1.40 కోట్లకు పెరగడం, మధ్యస్త పన్ను స్లాట్ 14.5 శాతం నుంచి 11.5 శాతానికి తగ్గించడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. ఒకే దేశం.. ఒకే పన్ను విధానం, సరళీకృత పన్ను చెల్లింపులతో వ్యాపారస్తులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆన్ లైన్ జీఎస్టీ నమోదు, క్రమబద్ధమైన రిటర్న్ ఫైలింగ్, ఆడిట్ ప్రక్రియలో మార్పు వచ్చిందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ ఎం. అంబి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ ఏ మాలతీ, తిరుపతి సర్కిల్ సీజీఎస్టీ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Famous TV