Famous TV - జాతీయ వార్తలు / : గిరిజన మహిళా రైతుకు అరుదైన అవార్డు AP: దేశంలోనే నాణ్యమైన కాఫీ గింజలను పండించిన గిరిజన మహిళా రైతు అశ్వినికి(అల్లూరి జిల్లా కప్పాడ గ్రామం) అరుదైన గుర్తింపు లభించింది. బెంగళూరులో జరిగిన ప్రపంచ కాఫీ సదస్సులో జ్యూరీ అధికారులు ఆమెకు 'ఫ్లేవర్ ఆఫ్ ఇండియా ది ఫైన్ కప్' అవార్డును ప్రకటించారు. ఆమె తరఫున భర్త అవార్డును స్వీకరించారు. 10 రాష్ట్రాల్లో సాగైన కాఫీ గింజలను ప్రదర్శించగా, అశ్విని పండించిన గింజలు నంబర్ 1గా నిలిచాయని అధికారులు తెలిపారు.
Admin
Famous TV