Famous TV - జాతీయ వార్తలు / చిత్తూరు : పుల్వామా అమరులకు జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ (జెసిఐ) తిరుపతి శాఖ సభ్యులు బుధవారం నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన 40 మంది వీర జవాన్లకు, స్థానిక కపిల తీర్థం వద్దనున్న అమర జవానుల స్తూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెసిఐ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ యువత దేశభక్తి, సామాజిక బాధ్యత పెంపొందించుకోవాలని పిలుపు నిచ్చారు. ఇండియన్ వెటరన్స్ ఆర్గనైజేషన్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హెచ్.ఎ.వి పి ఆనంద రెడ్డి మాట్లాడుతూ అప్పటి సంఘటన గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కె చంద్రా రెడ్డి, జి వెంకట నాగముని నాయుడు, జె.సి.ఐ తిరుపతి శాఖ అధ్యక్షుడు టి.వై.చైతన్య తేజ్, జోన్ డైరెక్టర్ డా॥ నూరీ పర్వీన్, గుణశేఖర్, దిలీప్, శంకరయ్య, సయ్యద్ సుముయ్య, తహసీన, నరేంద్ర, స్వాతి, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Famous TV