Famous TV - జాతీయ వార్తలు / : విజయవాడ నుండి నెల్లూరు, గూడూరు, రేణిగుంట, అరక్కోణం మీదుగా చెన్నైకి కొత్తగా వందే భారత్ ట్రైన్ ప్రవేశపెట్టినందుకు కేంద్ర రైల్వే శాఖా మంత్రికి ధన్యవాదాలు తెలియజేసిన ఎంపీ గురుమూర్తి తన పార్లమెంట్ పరిధిలోని ప్రజలు గూడూరు జంక్షన్ నుండి నిత్యం విద్య, వైద్య, వ్యాపార కార్యకలాపాల కోసం నిత్యం వేల సంఖ్యలో ప్రయాణిస్తుంటారని వారి సౌకర్యార్థం వందే భారత్ ట్రైన్ గూడూరులో స్టాపింగ్ సౌకర్యం కల్పిస్తే తక్కువ సమయంలో జిల్లా ప్రధాన కేంద్రానికి చేరుకొంటారని ముఖ్యంగా గూడూరు పరిసర ప్రాంతాలు మైకా మరియు ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రసిద్ధి గాంచినది కావడంతో ఇక్కడి ప్రజలు ఎక్కువగా విజయవాడకు కూడా ప్రయాణిస్తారని ప్రయాణికుల సౌకర్యార్థం ప్రజా ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని వందే భారత్ రైలుకు గూడూరు జంక్షన్ లో స్టాపింగ్ సౌకర్యం కల్పించాలని కేంద్ర రైల్వే శాఖా మంత్రికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లేఖ రాశారు.
Admin
Famous TV