Sunday, 26 July 2026 08:37:29 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

అలింకో మరియు తిరుపతి ఎంపీ నిధులతో దివ్యాంగులకు ఉపకరణ పరికరాల పంపిణి

Date : 26 September 2023 05:34 AM Views : 640

Famous TV - జాతీయ వార్తలు / : అలింకో మరియు తిరుపతి ఎంపీ నిధులతో దివ్యాంగులకు ఉపకరణ పరికరాల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, నెల్లూరు జడ్పి చైర్మన్ ఆనం అరుణమ్మ ఈరోజు నిర్వహించబడిన పంపిణి కార్యక్రమంలో ₹.38 లక్షల.70 వేల రూపాయల విలువ గల 316 ఉపకరణ పరికరాలను 225మంది దివ్యాంగులకు గౌరవ మంత్రి వర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి, నెల్లూరు జడ్పి చైర్మన్ ఆనం అరుణమ్మ చేతుల మీదుగా పంపిణి చేయడం జరిగింది. మొదటగా ఈ సంవత్సరం మే నెలలో దివ్యాంగులకు ఉపకారణాల పంపిణి చేసేందుకు అలింకో ఆదర్వంలో శిబిరం నిర్వహించబడిన విషయం విధితమే. ఈ శిబిరంలో మోటారైజ్డ్ ట్రై సైకిల్స్ పంపిణీ కొరకు 66 మంది దివ్యాంగులను గుర్తించగా అందులో 35 మంది అర్హులు సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన వారీగా అలింకో సంస్థ వారు గుర్తించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఉపకారణాల పంపిణీ కోసం ఎంపీ గురుమూర్తి ద్వారా అలింకో సంస్థ వారిని సంప్రదించి అర్హులను గుర్తించేదుకు శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే ఒక్కో మోటారైజ్డ్ ట్రై సైకిల్ విలువ ₹.42 వేల రూపాయలు కాగా అలింకో వారు 25 వేలు అందించగా మరో 17 వేల రూపాయలు అర్హత పొందిన దివ్యాంగులు కట్టవలసి ఉండగా తిరుపతి ఎంపీ ముందుకు వచ్చి మంచి మనసుతో తన నియోజకవర్గ నిధుల నుంచి ₹.5 లక్షల 95 వేల రూపాయల మొత్తాన్ని కేటాయించి నేడు ఈ వాహనాలను వారికి అందించేందుకు కృషి చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ కోరిన వెంటనే ముందుకు వచ్చి అర్హులను గుర్తించి ఉపకరణాలను పంపిణీ చేసేందుకు సహకరించిన అలింకో సంస్థ వారికీ ధన్యవాదములు తెలియజేశారు. ముఖ్యంగా దివ్యాంగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే స్పందించి అలింకో వారితో మాట్లాడి ఒప్పించామని తెలియజేసారు. నియోజకవర్గ అభివృద్ధిలో కాని నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు గుర్తించడంలో కాకాణి గారు ఆయనకీ ఆయనే సాటి అని ఎంపీ గురుమూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో 66 మందికి మోటారైజ్డ్ ట్రై సైకిల్స్, 24 మందికి కృత్రిమ అవయవాలు, 102 మందికి శ్రవణ యంత్రాలు, 17 మందికి ట్రై సైకిల్స్, మరియు చంక కర్రలు, చేతి కర్రలు, అందుల చేతి కర్రలు, వీల్ చైర్స్, సెల్ ఫోస్, సి.పి చైర్, రోల్లేటర్ లాంటి మొదలగు ఉపకారణాలు దివ్యాంగులకి పంపిణీ చేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: