Famous TV - జాతీయ వార్తలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ లో భక్తుల పై దాడి చేసిన హోటల్ నిర్వాహకులు బాదితుల వివరాల మేరకు చిత్తూరు జిల్లా,గంగవరం మండలం,గండ్రాజుపల్లికి చెందిన రెడ్డి ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో అమ్మవారి దర్శనం కోసం వచ్చారు.అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బోయకొండ దిగువ ప్రాంతం లో గల హోటల్ లో బోజనము ఐతే బాదితుల కథనం మేరకు బిల్లు చెల్లించామని, మూడువేలా ఐదువందలు అయ్యిందని, ఇంతనా, ఏమేమి ఎంత అని అడిగాడని, అందుకోసరమే గొడవ చేశారని వారు వాపోయారు.బిల్లు విషయమై ఒకరినొకరు మాటామాటా పెరిగి గొడవ కు దారితీసినది,ఇరుపక్షాలు ఒకరినొకరు కొట్టుకోవడం జరిగింది.రెడ్డి ప్రసాద్, అతని కుటుంబ సభ్యులు చౌడేపల్లి పోలీస్టేషన్ ను ఆశ్రయించారు.గతం లోకూడా ఇదేవివధంగా బోయకొండ లో భక్తుల పై దాడులు జరిగాయి.అప్పుడు చాలా విమర్శలు వచ్చాయి, అంతే కాకుండా ఆత్యాథ్మిక ప్రదేశాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఈ మద్యకూడా బోయకొండ లో తలల వేలం పాట వద్ద చిన్నపాటి గొడవ, అంతే కాకుండా బోయకొండ పైన గాని, క్రింద గాని ఇరవై రూపాయల వాటర్ బాటిల్ ముప్పై రూపాయలు, ఇడ్లీ ఒకటి పది రూపాయలు, దోస యాబై రూపాయలు, ఐదు రూపాయల ఐస్క్రీమ్ ముప్పై రూపాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు.అంతెందుకు చెట్టుక్రింద కూర్చోవడానికి బాడుగ ఇవ్వాలంటే ఎలాగో చెప్పండి.మరీ కవర్లు అమ్మే చోట రెండు రూపాయలు విలువ చేసే ప్లాస్టిక్ కవర్లు పదిరూపాయలకు అమ్ముచున్నారు.మరీ ఇంతలా దోపిడీ జరుగుతుంటే ఇటు రాజకీయ నాయకులు గాని, అటు దేవాదాయ శాఖ అధికారులు గాని పట్టించుకున్న దాఖలాలేదు.కావున నూతనంగా ఏర్పడే పాలక మండలి సభ్యులు ఐనా ఈ దోపిడిని అరికట్టాలని భక్తులు కోరుచున్నారు.
Admin
Famous TV