Famous TV - జాతీయ వార్తలు / : నేడు ఢిల్లీలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర రోడ్డు రవాణా శాఖామాత్యులు నితిన్ గడ్కరితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మొదటగా చెన్నై నుండి అరక్కోణం, పుత్తూరు మీదుగా రహదారి విస్తరణ గూర్చి విన్నవించిన వెంటనే స్పందించి మంజూరు చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే గత కొద్ది రోజులుగా పెండింగులో ఉన్న తిరుపతి ఇంట్రా మోడల్ బస్ స్టేషన్ పనులను మొదలెట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాలనీ కోరారు. నాయుడుపేట సమీపంలో విన్నమల గ్రామం మీదుగా 4 లైన్ల జాతీయ రహదారి -5 వెళుతుందని ప్రస్తుతం ఇది 6 లైన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి చేయబోతున్నారని కి.మీ 57 ర్యాంపు-1 వద్ద పరిసర గ్రామాల ప్రజలు జాతీయ రహదారికి ఇరువైపులా రాకపోకలు సాగిస్తున్నారని ఇందులో వంద మందికి పైగా విద్యార్థులు పాఠశాల, హైస్కూల్ మరియు జూనియర్ కళాశాలలకు ప్రయాణిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ సచివాలయం, ఆరోగ్య క్లినిక్, రేషన్ దుకాణం, దేవాలయాలు, ప్రైవేట్ కంపెనీలు వంటి వివిధ గమ్యస్థానాలకు చేరుకోవడానికి జాతీయ రహదారిని సుమారు రెండు వేల మంది ప్రతి నిత్యం దాటుతున్నారని ప్రతి సంవత్సరం అనేక మంది విద్యార్థులు మరియు గ్రామస్తులు రోడ్డు ప్రమాదాలలో తమ ప్రాణాలను కోల్పోతున్నారని మరియు రహదారిపై ప్రమాదాల కారణంగా గాయపడ్డ వారు కూడా గణనీయంగా ఉన్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం నాలుగు లేన్ల జాతీయ రహదారిని 6 లైన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రమాదాల తీవ్రత మరింత పెరుగుతుందనే ఆందోళన సర్వత్రా నెలకొందని అందువలన ర్యాంప్-1 వద్ద అండర్పాస్ ఏర్పాటు చేసేందుకు వీలైనంత త్వరగా అవసరమైన చర్యలు తీసుకొవాలని కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.
Admin
Famous TV