Famous TV - ఆరోగ్యము / తిరుపతి : మంగళవారము ఎస్ వి వైద్య కళాశాల మరియు అసోసియేషన్ ఆఫ్ పల్మోనాలజిస్ట్స్ ఆఫ్ సీమాంధ్ర ఆధ్వర్యంలో పల్మనరీ మెడిసిన్ డిపార్ట్మెంట్ వారు ప్రపంచ ఆస్తమా దినాన్ని నిర్వహించడం జరిగినది. ఎస్వీ వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఆస్తమాలో ఇటీవలి పురోగతిపై నిరంతర వైద్య విద్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ సుబ్బారావు ప్రొఫెసర్ అండ్ హెచ్వైడి మాట్లాడుతూ ఆస్తమా వల్ల ప్రజల్లో కలుగుతున్న ఆరోగ్యంలోని ఇబ్బందులను ఎప్పటికప్పుడు గుర్తించి రోగికి మెరుగైన వైద్యం అందించడానికి ఇలాంటి కార్యక్రమాలు వైద్యులకు, పీజీ వైద్య విద్యార్థులకు అవసరమని అన్నారు. మెరుగైన వైద్యం పేదలకు అందించడంలో ఇలాంటి వర్క్ షాప్స్ ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ ప్రేమానంద రాయ్, డాక్టర్ నరసింహన్, డాక్టర్ హితేసీ, ఆర్గనైజేషన్ సెక్రటరీ డాక్టర్ సుబ్బారావు డాక్టర్ రాయపూర్ రమేష్ బాబు , వైద్యులకు పీజీ వైద్య విద్యార్థులకు ఆస్తమా పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో నూతనంగా వస్తున్న మార్పులను సులువైన పద్ధతిలో వైద్యం అందించడానికి కావలసిన తోడ్పాటును అందించడానికి వైద్యులకు, పీజీలకు అందుబాటులో ఉంటామని డాక్టర్ నరసింహ , డాక్టర్ ప్రేమానంద్ రాయ అన్నారు. ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్. జి. రవి ప్రభు ఆర్గనైజింగ్ చైర్మన్: డా.కె. రాజేంద్ర కుమార్ APMC పరిశీలకుడు కో-ఛైర్మన్: డా. జి. రవీంద్ర బాబు వైద్యులు వైద్య విద్యార్థులు, పల్మనరీ మెడిసిన్ విభాగం, సిబ్బంది, మరియు ఎస్ వి.వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV