Famous TV - ఆరోగ్యము / తిరుపతి : తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల, ప్రసూతి ఆసుపత్రి రెండవ అంతస్తులో ఈనెల మూడవ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు మాతృమూర్తి మిల్క్ బ్యాంక్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నట్లు రోటరీ క్లబ్ తిరుపతి జిల్లా కార్యదర్శి సోము రవికుమార్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ... తల్లిపాలను ఏ బిడ్డకైనా పట్టవచ్చునున్నారు. రక్తదానం చేస్తే తిరిగి శరీరంలో రక్తం ఎలా వృద్ధి చెందుతుందో... అదే విధంగా తల్లిపాలను దానం చేస్తే అంతకంత పేరుగు తుoదని ,, తల్లిపాలు దానం ఇచ్చిన్నా , తీసుకున్నా ఉచితంగానే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓ తల్లి తన బిడ్డకు పాలు పట్టిన తర్వాత మిగిలిన పాలను దానం చేస్తే ఆమె ఆరోగ్యంగానే జీవిస్తుందని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో టెంకాయలు దామోదరం ,, డాక్టర్లు కిషోర్ , అసిఫ్ , హేమచంద్ర , కరుణానిధి మాఘం తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV