Sunday, 26 July 2026 03:29:54 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

సంక్షేమ పథకాల పేరుతో రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అమలు చేయని పాలకులు

డా.ముప్పారం ప్రకాశం సమక్షంలో భారీగా బీఎస్పీ పార్టీలో చేరిన వెండికోల్ గ్రామ ప్రజలు

Date : 12 July 2023 05:21 PM Views : 387

Famous TV - తెలంగాణ / : జులై 12, 2023 చౌటకూర్: ప్రజా సంక్షేమం కోసం దేశ అభివృద్ధి కోసం రాజ్యాంగం ఇచ్చిన హక్కులను బాధ్యతగా అమలు చేయని పాలకులు సంక్షేమ పథకాల పేరుతో సబ్బండ ప్రజానీకాన్ని మోసం చేస్తున్నారని బహుజన్ జన సమాజ్ పార్టీ (బిఎస్పీ) అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ డా.ముప్పారం ప్రకాశం అన్నారు. చౌటకూర్ మండలంలోని వెండికోల్ గ్రామంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన యువకులు, గ్రామ ప్రజలు నేడు బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా.ముప్పారం ప్రకాశం సమక్షంలో భారీగా చేరిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో గ్రామ మహిళలు, యువకులు, గ్రామ పెద్ద మనుషులు వివిధ అంశాలపై మాట్లాడారు. అనంతరం ముప్పారం ప్రకాశం మాట్లాడుతూ ఈ దేశ ప్రజల బతుకులు మార్చడం కోసం ఆనాడే అంబేద్కర్ గారు ప్రజల హక్కులను రాజ్యాంగబద్ధంగా చట్టం చేస్తే, పాలకులు రాజ్యాంగాన్ని అమలు చెయ్యకుండా, సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి, రాష్ట్ర, దేశ సంపదనంతా సంపన్న వర్గాలకు పంచుతూ పేదలను మోసం చేస్తు, దేశాన్ని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. ఈ దేశ రాష్ట్ర భవిష్యత్తును కేవలం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే మారుస్తుందని, తెలంగాణ రాష్ట్రానికి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి అయితేనే అందరి బతుకులు మారుతయని అన్నారు. ఈ సభలో ముప్పారంప్రకాశం బి.ఎస్.పి. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సభా నంతరం గ్రామంలో వీధి వీధిన ర్యాలీ నిర్వహించి, గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముగించినరు. ఈ సభ అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు పల్లె కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. నాయకులు ప్రభు, బెంజిమెన్, నాగరాజ్, లక్ష్మణ్, నరేష్, మహేందర్, రాకేష్, బాల్రాజ్, ఉదయ్, వెంకటేశం, పల్లె కిరణ్ కుమార్, శ్రీనివాస్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :