Famous TV - తెలంగాణ / : టేక్మల్ మండల పరిధిలోని ఎల్లుపేటలో నల్లోల్ల రామలింగం అంత్యక్రియలకు హాజరైన బీఎస్పీ పార్టీ నేత డా.ముప్పారంప్రకాశం మాట్లాడుతూ అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే సరైన ఉపాధి అవకాశాలు కల్పించని కారణంగా, కుటుంబాల పోషణ కోసం పట్టణాలకు వలస పోయి. అక్కడ పనిచేసే దగ్గర సరైన రక్షణ లేక బంగారు తెలంగాణ రాష్ట్రంలోని ఎళ్ళుపేట గ్రామంలోని అనేక మంది ప్రజలు నేటికీ మృత్యువుడిలోకి పోవడం బాధాకరమన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాలు కేవలం ఒక నినాదంగానే నిలిచిపోయాయని, స్థానిక వాదంతోటి అధికారంలోకి వచ్చి స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే చేసిన ఏ ఒక్క మేలులేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడు నల్లోల్ల రామలింగం భార్య నిండు చూలాలుగా ఉండడాన్ని చూసి చలించిపోయిన డా.ముప్పారం ప్రకాశం, టేక్మల్ మండల బిఎస్పీ అధ్యక్షులు సిద్దులు కలిసి ఆమెకు ఆర్థిక సహకారం అందించి భవిష్యత్తులో ఆ కుటుంబానికి బిఎస్పి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మృతుడు నల్లోల్ల రామలింగం భార్య నిండు చూలాలుగా ఉండడాన్ని చూసి చలించిపోయిన డా.ముప్పారం ప్రకాశం, టేక్మల్ మండల బిఎస్పీ అధ్యక్షులు సిద్దులు కలిసి ఆమెకు ఆర్థిక సహకారం అందించి భవిష్యత్తులో ఆ కుటుంబానికి బిఎస్పి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాదులో ప్రమాదానికి గురై మృతి చెందిన నల్లోల్ల రామలింగం పార్థివ దేహం పై పార్టీ జెండాను కప్పి, అంత్యక్రియలు పూర్తి అయ్యేవరకు బిఎస్పి నాయకులందరూ పాల్గొని బౌద్ధ వందనాల తోటి అంత్యక్రియలను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాపయ్య, నాయకుడు నగేష్, కృష్ణ, శేఖర్, కిరణ్ కుమార్, ప్రవీణ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు
Admin
Famous TV