Famous TV - క్రీడలు / తిరుపతి : 8th AP స్టేట్ లెవెల్ సీనియర్ ఇంటర్ డిస్టిక్ రగ్బీ ఛాంపియన్షిప్ 2023-24 పోటీలు ఈస్ట్ గోదావరి జిల్లా,పిఠాపురంలో జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న శ్రీకాళహస్తి నియోజకవర్గం సీనియర్ మెన్ అండ్ ఉమెన్ క్రీడాకారులకు ఉచితంగా జెర్సీలను స్పాన్సర్ చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు.
ఇంటర్ డిస్టిక్ రగ్బీ పోటీల్లో పాల్గొని నాలుగో స్థానం సాధించిన క్రీడాకారులు ఈరోజు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గారిని కలసి వాళ్లు సాధించిన సర్టిఫికెట్లను మరియు మెడల్స్ ను చూపించి స్పాన్సర్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు మరియు సిపిఎం నాయకులు పి.మధు, కందారపు మురళి, పుల్లయ్య , గోపి గౌడ్, సుధాకర్ రెడ్డి ,నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV