Famous TV - క్రీడలు / తిరుపతి : అల్ ఇండియా సీనియర్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ రన్నర్ కప్ 60 సం. విభాగంలో డా. సి. శ్రీరాములు గారికి వరించింది. తిరుపతి కేంద్రంగా సెప్టెంబర్8,9,10 తేదీలలో టౌన్ క్లబ్, ఆఫీసర్స్ క్లబ్, ఎస్. వి. ఆర్ట్స్ కాలేజ్,సాహితి టెన్నిస్ అకాడెమీ నందు 40,50,60,70 వయసు విభాగాలలో ప్రముఖ సీడెడ్ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ శరవన సుందరం మెమోరియల్ టోర్నమెంట్ లో అనేక రాష్ట్రాల నుండి పాల్గొనడం విశేషం.ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ మ్యాచ్లలో తిరుపతి కి చెందిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ డా.సి.శ్రీరాములు 60 వయసు విభాగంలో రున్నప్ గా నిలిచారు. ఇప్పటికే యు. ఎస్. ఎ. లోని పోర్ట్లాండ్ సిటీ నందు ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ నందు ఫైనల్ కు చేరుకొని 230 పాయింట్లను సాధించారు.ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
Famous TV